యంగ్ రెబల్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్.ఈ సినిమా భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు రావడానికి జూన్ 16న సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఆదిపురుష్ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది.సినిమా బడ్జెట్ దాదాపు 500 కోట్లు కాగా.. బడ్జెట్ 90 శాతం థియట్రికల్, ఓటీటీ హక్కుల రూపంలో కొట్టేసింది. సినిమా హిట్టయితే నిర్మాతలకు కాసుల సునామీ వచ్చినట్లే.ఈ సినమా హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తీసుకుందని సమాచారం. ఇక ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఆదిపురుష్ సినిమాని ఓటీటీ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ 250 కోట్లకు కొన్నదని టాక్ .
సినిమా విషయానికి వస్తే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో, కృతిసనన్ సీత పాత్రలో భారీ బడ్జెట్ తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో విజువల్ వండర్ గా రూపుదిద్దుకుంది. జూన్ 16న విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాత మూవీ టికెట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉచితంగా టికెట్స్ పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు.రామాయణాన్ని ఇప్పటితరానికి పరిచయం చేస్తూ, ప్రస్తుత టెక్నాలజీని ఉపమోగిస్తూ విజువల్ వండర్ గా తెరకెక్కించారు.ఈ సినిమా ఎలాంటి విజయాని సొంతం చేసుకుంటుందో వేచి చూడాల్సిందే.