Prabhas and nag ashwin movie story update :
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో.. రికార్డుల బెండు తీశాడు. ఆ తరువాత సుజిత్ దర్శకత్వంలో చేసిన సాహో సినిమా టాలీవుడ్ లో పెద్దగా సక్సస్ అందుకోలేదు కానీ బాలీవుడ్ లో దుమ్ములేపింది ఈ సినిమా.. ఎస్. రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ తన 20వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత ప్రభాస్ తన 21వ సినిమాను నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్నాడు.
అయితే ప్రస్తుతం ప్రభాస్ 21వ సినిమా గురించి ఒక రూమర్ తెగ హల్ చల్ చేస్తుంది. ప్రభాస్ సాధారణ మానవుడికి, ఓ దేవకన్యకు పుట్టిన సూపర్ మాన్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడట.
ఈ సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీకి సీక్వెల్ కథలా ఉందే అని అందరూ ఈ సినిమా గురించి తెగ చెర్చించుకుంటున్నారు. ఈ మధ్య అశ్వినీ దత్ కూడా జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు సీక్వెల్ ఉంటుందన్నారు.
ప్రస్తుతం నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న తన 21 సినిమా ఆ సినిమాకు సీక్వెల్ అయి ఉంటుందన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎంత వరకు వాస్తవమో.. తెలియాల్సి ఉంది. అయితే ఈ విషయం పై సినిమా టీమ్ నుండి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటణా రాలేదు.
ప్రభాస్ 21 సినిమా స్టొరీ జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీకి సీక్వెల్ లా ఉంటుందా.. ? లేక మరేదయినా కొత్త కథ తో సినిమా చేస్తారా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Telugu Movie News :
- బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డుల దుమ్మ దులపడానికి బన్నీ భారీ ప్లాన్..!
- ప్రభాస్ 21 స్టోరీ లైన్ లీక్..!
- ఆచార్య నుండి అదిరిపోయే డైలాగ్ లీక్..!
- ఆ డైరెక్టర్ తో పవన్ సినిమా చేస్తాడా..?
- వైరల్ గా మారిన స్టార్ హీరో భార్య డాన్స్ వీడియో..!
- 6 నిమిషాల ఫైట్ కోసం 6 కోట్లు..దిమ్మతిరిగే షాక్..!
Related Posts :